ప్రత్యేక హోదా పోరుకు రాహుల్

SMTV Desk 2017-06-04 12:47:29  congress,guntur,rahul gandhi

గుంటూరు, జూన్ 4 : నేడు గుంటూరులో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరుగనున్న ప్రత్యేక హోదా భరోసా సభకు ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా రానున్న ఈ సభకు భారీ ఏర్పాట్లు చేసినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. యుపీఏ మిత్రపక్షాలకు చెందిన జాతీయ స్థాయి నేతలు ప్రత్యేక హోదా కోసం తమ నినాదాలను వినిపించాలని రాహుల్ గాంధీ తో కలిసి వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గుంటూరు పొన్నూరు రోడ్డులోని ఆంధ్రా ముస్లిం కళాశాల ప్రాంగణం లో ఆదివారం సాయంత్రం 5.30 నుండి 7.30 గంటల వరకు ఈ సభ జరుగనుంది. సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ సభలో రాహుల్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు క్రిష్ణ జిల్లా లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో సభ జరిగే స్థలానికి విచ్చేస్తారు.