బొజ్జ గణపయ్యను దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి

SMTV Desk 2017-09-04 10:28:57  hyderabad, khairatabad, vice president of india venkaiah naidu

హైదరాబాద్, సెప్టెంబర్ 4: జై జై జై గణేశా...జై జై గణేశా...అంటూ భక్తులు గణనాదున్ని గంగమ్మ ఓడికి చేరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాలల్లో వినాయక నిమర్జనం ఘనంగా సాగుతుంది. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఖైరతాబాద్ విఘ్నేశ్వరున్ని దర్శించుకునేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. ఈ నేపధ్యంలో సాధారణ భక్తులకు దర్శనం నిలిపివేశారు. అనంతరం ఖైరతాబాద్ వినాయకుని నిమర్జనం కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. నిమర్జనానికి తరలి వచ్చే గణపయ్య లతో హుస్సేన్ సాగర్ వద్ద రద్దీ పెరిగింది. ఈ నేపధ్యంలో హుస్సేన్ సాగర్ లో సహా పలు చెరువుల్లో నిమర్జనం చేయటానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల డాన్స్ లు ,డప్పు చప్పుల్ల మధ్య గణనాదున్ని తీసుకొచ్చి ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం చేస్తున్నారు.