హైదరాబాద్ సెప్టెంబర్ 2: టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ పేరు చెప్పుకొని గెలిచే నాయకులు చాలా మంది ఉన్నారు కానీ, సొంత ఇమేజ్ తో గెలిచే నాయకులు ఒక్కరైనా ఉన్నారా..? అని టీపీసీసీ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అదే కాంగ్రెస్ పార్టీలో అయితే సొంత ఇమేజ్ తో గెలిచే నాయకులు చాలా మంది ఉన్నారని అన్నారు. 2014 తో పోల్చుకుంటే టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ బాగా పడిపోయిందని, అలాగే కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకొందని ఆయన పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలను గెల్చుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కోదండరాం పార్టీ పెడితే మాత్రం టీఆర్ఎస్ పార్టీకే నష్టమని ఆయన అన్నారు.