హైదరాబాద్, సెప్టెంబర్ 2 : త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ ను ముస్లీంలు రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈద్గాల వద్ద చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదు వద్ద పెద్ద ఎత్తున తరలి వచ్చిన ముస్లీం లు అల్లాకు ప్రార్ధనలు చేశారు. బక్రీద్ కావడంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.