టీడీపీ గెలుస్తే కాపు ఉద్యమం ఆగుతుందా..?

SMTV Desk 2017-09-02 15:03:45  

ఆంధ్రప్రదేశ్ సెప్టెంబర్ 2: కాపులను బీసీ జాబితాలో చేర్చాలని వైకాపా నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ డిమాండ్ కోసం వైకపా ఎంతగా పోరాటం చేస్తున్నా బాబు మాత్రం వారిని చల్లబరుస్తూ వస్తున్నారు. గతంలో కాపు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో బాబు బడ్జెట్ లో వారికి వెయ్యి కోట్ల నిధులను ప్రకటించి వారిని శాంతింపజేశారు. అయితే బాబు ఎన్ని రాజకీయాలు చేసినా కాపు ఉద్యమం మాత్రం ఆగదని ముద్రగడ స్పష్టం చేశారు. కాకినాడ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచినంత మాత్రాన కాపు ఉద్యమం ఆగబోదని స్పష్టం చేశారు. బాబు నేడు మీడియా లో మాట్లాడుతూ కాపు ఉద్యమ ప్రభావం లేదని అనడం ఆయన అవివేకానికి నిదర్శనం అని ముద్రగడ విమర్శించారు.