చైనాను కలవర పెడుతున్న బ్రిక్స్ సదస్సు...!

SMTV Desk 2017-09-02 14:19:58  China Bricks Countries MeetIndian Prime Minister Narendra Modi, Pakistan,

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2 : చైనా బ్రిక్స్ దేశాల భేటీ ఈ నెల 3న జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరవ్వనున్నారు. ఈ నేపథ్యం లో బ్రిక్స్ సమావేశాల్లో ఉగ్రవాద సమస్య, ఉగ్రవాదులకు పాకిస్థాన్ సహకారం తదితర అంశాలను భారత్ లేవనెత్తుతుందని చైనా కలవరపెడుతోంది. ఈ మేరకు పాకిస్థాన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడవద్దంటూ భారత్ కు చైనా సంకేతాలను పంపడం జరిగింది. భారత్ ఈ సంకేతాల పట్ల అదే స్థాయిలో స్పందిస్తూ ఈ నెల 4వ తేదీన అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలను ఒక చర్యకు వచ్చే సందర్భంగా పాకిస్థాన్ గురించి మోదీ ప్రస్తావించే అవకాశం ఉందని, విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.