నేడు కశ్మీర్ లో ప్రారంభమైన సమన్వయ సమావేశాలు

SMTV Desk 2017-09-02 12:25:00  kashmir, sang parivar, Sangh Parivar Organization, Sangh President Mohan Bhagwat,BJP president Amit Shah

కాశ్మీర్, సెప్టెంబర్ 2 : జమ్మూ కాశ్మీర్ లో రాళ్ల దాడులను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ నాయకులు ప్రశంస జల్లు కురిపించారు. ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లో జరుగుతున్న సంఘ్ పరివార్ సంస్థల మూడు రోజుల సమన్వయ సమావేశాలు నేడు ప్రారంభం కాగా, భాజపా, బీహెచ్ పీ, భజ్ రంగ్ దళ్ కు చెందిన కీలక నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. సంఘ్ అధ్యక్షుడు మోహన్ భగవత్, భాజపా అధ్యక్షుడు అమిత్ షా మొదటి రోజు భేటీలో పాల్గొన్నారు. ఆర్ ఎస్ ఎస్ నేతలపై జరుగుతున్న దాడులు సహా సంఘ్ పరివార్ చేపట్టిన పనులకు గురించి మూడు రోజుల భేటీలో చర్చించనున్నారు.