బీహార్ లో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ

SMTV Desk 2017-09-02 11:56:41  bihar, cm nithishkumar, congress, jdu, soniyagandhi

బీహార్, సెప్టెంబర్ 2 : బీహార్ లోని కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగలనుంది. బీజేపీ తో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జట్టు కట్టడంతో, గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి తలకిందులైంది. ఈ నేపథ్యంలో, ఆ పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ పార్టీ జేడీయూలో చేరబోతున్నట్లు తెలుసుకున్న విషయంపై కాంగ్రెస్ పెద్దలను కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో, బీహార్ కీలక నేతలను ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఢిల్లీకి వెంటనే పిలిపించుకోవడం జరిగింది. సోనియాతో పాటు గులాం నబీ అజాద్, అహ్మద్ పటేల్, సీపీ జోషీలు కూడా జేడీయూ నేతలతో మాట్లాడడం జరిగింది. అయినా వారి ప్రయత్నం ఫలించేలా లేదు.