తిరుమల, సెప్టెంబర్ 1: తెదేపా ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు నేడు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు విచ్చేశారు. నేటి ఉదయం ఆయన తిరుమలేశుడిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం బయటకు వచ్చిన ముద్దు కృష్ణమనాయుడిని మీడియా ప్రతినిధులు ప్రశ్నలతో సంధించారు. దీంతో ఆయన మీడియా ప్రతినిధులకు సూచనలు జారీ చేశారు. పుణ్యక్షేత్ర దర్శనానికి వచ్చిన రాజకీయ నేతల ఎదుట మైకులు పెట్టవద్దని ఆయన తెలిపారు. అలా చేయడం వలన రాజకీయ విమర్శలు ఎక్కువవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధువులు, గురువులు, టీటీడీ అధికారులు మాత్రమే ఇక్కడ మాట్లాడాలని ఆయన తెలిపారు.