కేంద్ర మంత్రి వర్గం నుంచి దత్తాత్రేయ తొలగింపు..!

SMTV Desk 2017-09-01 15:00:05  Union Cabinet,BJP leader Bandaru Dattatreya, BJP national president Amit Shah, meeting

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1 : ప్రముఖ బీజేపీ నేత బండారు దత్తాత్రేయను కేంద్ర మంత్రి వర్గం నుంచి తొలగించనున్నారు. దత్తాత్రేయను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలిపించుకుని ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో దత్తాత్రేయకు అమిత్ షా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భేటీ అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ... తనకు గవర్నర్ పదవిని ఇస్తామంటూ పార్టీ హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఉదయం కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో పలువురుకి మంత్రివర్గంలో కొత్తగా స్థానం లభించడంతో పాటు మరోవైపు అధిష్ఠానం సూచనల మేరకు ఇప్పటికే పలువురు నేతలు తమ పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు.