ఎయిర్‌టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్స్!

SMTV Desk 2019-11-22 13:37:10  

ఎయిర్‌టెల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా ఫాస్టాగ్‌ కొనుగోలుపై రూ.50 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. నే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ కస్టమర్లు ఆన్‌లైన్‌లో ఫాస్టాగ్స్ కొనుగోలు చేయడం వల్ల అదనంగా రూ.50 క్యాష్‌బ్యాక్ ప్రయోజనం పొందొచ్చు. డిసెంబర్ 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్స్ తప్పనిసరి. మోదీ ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. టోల్ ప్లాజాల వద్ద ఇప్పుడు చార్జీల చెల్లింపు కోసం క్యాష్ తీసుకోరు. ఫాస్టాగ్స్ ద్వారానే ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతుంది. అందువల్ల జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్స్ తప్పనిసరి. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ కస్టమర్లు బ్యాంక్ నుంచి రూ.50 క్యాష్‌బ్యాక్‌ను సొంతం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ దీని కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ), ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ (హెచ్‌ఎంసీఎల్)‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తన డిజిటల్ అండ్ రిటైల్ టచ్‌పాయింట్స్‌లో FASTag లను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. లేదంటే యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఫాస్టాగ్స్ కొనుగోలు చేయాలని భావించే వారు వారి వెహికల్‌కు చెందిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ) కాపీని అందించాల్సి ఉంటుంది. ‘ఫాస్టాగ్ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ లేదా వాలెట్‌తో లింక్ అయ్యి ఉంటుంది. దీంతో టోల్ చార్జీలు వెంటనే అకౌంట్ నుంచి కట్ అవుతాయి. దీంతో ఫాస్టాగ్‌ను మళ్లీ ప్రత్యేకంగా రీచార్జ్ చేసుకోవలసిన అవసరం కూడా ఉండదు’ అని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఫాస్టాగ్ యూజర్లు 2.5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) తెలిపింది. ఫాస్టాగ్స్ ద్వారా నిర్వహించే టోల్ చార్జీల పేమెంట్స్‌కు ఇది వర్తిస్తుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) గణేశ్ అనంత నారాయణ్ మాట్లాడుతూ.. ఫాస్టాగ్ సేవలు అందించేందుకు ఎన్‌పీసీఐ‌తో జతకట్టడం సంతోషంగా ఉందన్నారు. క్యాష్‌లెస్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు తమవంతు కృషి చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా కాలంలో డిజిటల్ పార్కింగ్ పేమెంట్స్, చలానా పేమెంట్స్ వంటి సేవలను కూడా కస్టమర్లకు అందిస్తామని పేర్కొన్నారు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ చొరవను అభినందిస్తున్నామని ఎన్‌పీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ రాయ్ తెలిపారు. ఎయిర్‌టెల్ బ్యాంక్ వాహనదారులకు ఫాస్టాగ్స్ అందిస్తోందని, దీని వల్ల టోల్ ప్లాజాల వద్ద వేచిచూడాల్సిన అవసరం ఉండదని, ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 528కు పైగా toll plaza ల వద్ద ఫాస్టాగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.