కావడిలో కన్నవారిని 40 కిలోమీటర్లు మోసిన యువకుడు

SMTV Desk 2017-09-01 14:37:38  Mayurbhan district in Odisha, 18 days imprisonmeKarthik Singhnt, Duplicate case, police

భువనేశ్వర్, సెప్టెంబర్ 1 : ఇటీవల ఓడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది.. ఓ యువకుడు తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ 40 కిలోమీటర్లు నడిచారు. చేయని నేరానికి తనకు 18 రోజుల జైలు శిక్ష విధించారు. అసలు విషయంలోకి వెళితే... మోరదా గ్రామానికి చెందిన కార్తీక్‌ సింగ్‌పై 2009లో ఓ నకిలీ కేసు నమోదై ఆయ‌న‌కు ఈ శిక్ష ప‌డింది. పోలీసులు ఆయనను జైల్లో ఉంచిన కార‌ణంగానే ఆయ‌న‌ను గ్రామ‌స్తులు త‌న ఊరి నుంచి బ‌హిష్క‌రించి, పని కూడా ఇవ్వట్లేదు. పెళ్లి చేసుకుందామంటే పిల్ల‌ను కూడా ఇవ్వ‌డం లేదు. త‌మ‌ జిల్లా కలెక్టర్‌ను క‌లిసి స‌మ‌స్య చెప్పుకున్న‌ప్ప‌టికీ ఫ‌లితం రాలేదు. మ‌రోప‌క్క అతడి త‌ల్లిదండ్రుల‌కు ఒక్క పూట అన్నం దొర‌క‌డ‌మే క‌ష్ట‌మైపోతోంది. దీంతో ఇలా కార్తీక్ నిర‌స‌న తెలుపుతున్నాడు. ఈ మేరకు తన తల్లిదండ్రులు చనిపోయేలోపైనా తాను నిర్దోషినని నిరూపించుకుంటాన‌ని ఆ యువకుడు పేర్కొన్నాడు.