ఏపీలో ఇవాళ్టి నుంచి YSR నవశకం కార్యక్రమం ప్రారంభం కానుంది. సంక్షేమ పథకాల పరిమితులను వివరిస్తూ.. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకు గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటా సర్వే నిర్వహించి, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను గుర్తిస్తారు. అలా గుర్తించిన లబ్ధిదారులను జనవరి 1 , 2020 నుంచి కొత్త బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు , జగనన్న విద్యా దీవెన కార్డు, జగనన్న వసతి దీవెన కార్డు, YSR పెన్షన్ కార్డులను అందజేయనున్నారు.