మోదీ పై సంచలన వ్యాఖ్య చేసిన హిజ్బుల్ ముజాహిద్దీన్ మాజీ క‌మాండ‌ర్ జాకీర్ ముసా

SMTV Desk 2017-09-01 14:09:30  Indian Prime Minister Narendra Modi, Islam flag, Hejb Mujahideen former commander Zakir Musa, media

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1 : భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఖండాంత‌ర్గ‌త భాగంలో ఇస్లాం జెండా ఎగ‌ర‌వేయ‌నీయ‌కుండా త‌మ‌ను ఎన్ని రకాలుగా అడ్డుకుందామని ప్రయత్నాలు చేసినా, ఎలాంటి ఆటంకాలు ఎదురు వ‌చ్చినా జెండాను ఎగుర‌వేసి తీర‌తామ‌ని హిజ్బుల్ ముజాహిద్దీన్ మాజీ క‌మాండ‌ర్ జాకీర్ ముసా వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం అల్‌-ఖ‌యిదా క‌శ్మీర్ సెల్ అన్సార్ ఘ‌జ్వాట్ ఉల్ హింద్ నాయ‌కునిగా ఉన్న జాకీర్ యూట్యూబ్‌లో 10 నిమిషాల నిడివి ఉన్న ఆడియోను అప్‌లోడ్ చేశారు. అన్సార్ ఘ‌జ్వా అధికారిక యూట్యూబ్ ఛాన‌ల్‌లో పెట్టిన ఈ ఆడియోలో గోవుల‌ను పూజించే హిందూ ప్ర‌ధాని మోదీ బారి నుంచి భార‌త దేశానికి స్వాతంత్రం క‌ల్పిస్తామ‌ని జాకీర్ అన్నారు. జ‌మ్మూ కాశ్మీర్‌ను పూర్తి ఇస్లాం రాష్ట్రంగా మార్చేందుకు జాకీర్ చాలా సార్లు విలేకరులను వేదిక‌గా చేసుకున్నారు. దీంతో త‌న మాట‌ల‌తో అక్క‌డి యువ‌కుల‌ను భార‌త ర‌క్ష‌ణ ద‌ళాల మీద దాడికి దిగేలా ప్రేరేపించడంతో `గోవుల‌ను పూజించే న‌రేంద్ర మోదీ, త‌న రాజ‌కీయ, ద్వైపాక్షిక విధానాల ద్వారా ఎంత మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టుకున్నా మ‌మ్మ‌ల్ని ఆపలేరన్నారు.