జగన్ కి భారీ షాక్ ఇవ్వనున్న చంద్రబాబు!

SMTV Desk 2019-10-29 17:08:27  

ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక కొరత కారణం గా ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే చంద్రబాబు జగన్ తీరుపై చాల వ్యాఖ్యలు చేసారు. ఇసుక కొరత మానవ తప్పిదం అని అన్నారు. చూస్తుంటే ఇదంతా జగన్ మాయ లా ఉందని ఆరోపించారు. ఆన్లైన్ ద్వారా ఇసుక విక్రయాలు జరగడం పట్ల తన ఆవేదనని వ్యక్త పరిచారు. సొంత ఊరులోని వాగుల్లోని ఇసుక ని తీసుకోడానికి అనేక అడ్డంకులు సృష్టించి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని అన్నారు.

జలాశయాల్ని ఎందుకు నింపలేదని జగన్ అధికారుల్ని ఇపుడు ప్రశ్నించడం హాస్యాస్పదం అంటూ ఎద్దేవా చేసారు. అవసరమైన జలాశయాల నీరు మొత్తాన్ని సముద్రాల్లోకి వొదిలి వృధా చేసారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే లపై పెడుతున్న అక్రమ కేసుల పైన చంద్రబాబు స్పందించారు. అక్రమ కేసులు పెట్టి చింతమనేని ప్రభాకర్ ని, భూమా అఖిల ప్రియా ని వేధిస్తున్నారని అన్నారు. వల్లభనేని వంశీ విషయం లో కూడా అదే జరుగుతుంది అంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు. కోడెల మృతికి కూడా అక్రమ కేసులే కారణం అని మరొక సారి స్పందించారు. అయితే రాష్ట్రానికి వచ్చిన మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు అన్నారు. దాదాపు 620 చోట్ల వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు.