తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శనివారం ఇందిరాపార్క్ వద్ద నిరవదిక నిరాహార దీక్ష చేపట్టనున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తెలియజేశారు. ‘ఆర్టీసీ కార్మికులు తిన్నది అరగక సమ్మె చేస్తున్నారంటూ’ సిఎం కేసీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతారాం స్పందిస్తూ, “హుజూర్నగర్ ఉపఎన్నికలలో తెరాస గెలుపుతో సిఎం కేసీఆర్ అహంభావం మరింత పెరిగినట్లు ఆయన మాటలతో అర్ధం అవుతోంది. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులను ఉద్దేశ్యించి నోటికి వచ్చినట్లు అహంభావంతో మాట్లాడుతున్న కేసీఆర్ అదే కార్మికుల పోరాటాల వలన ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుంచుకోవాలి. ఇకనైనా సిఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.