అమరావతి, ఆగస్ట్ 31: ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర నేడు మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, డేరా స్వచ్చ సౌధా చీఫ్ గుర్మీత్ బాబాకు పట్టిన గతే పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి కావాలనుకున్న కల నెరవేరాలంటే కడపను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తేనే సాధ్యపడుతుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కాగా, వైసీపీ ఎమ్మెల్యే రోజా గురించి ప్రజలు ఎంత తక్కువ మాట్లాడితే వారికి అంత మంచిదంటూ ఆయన సూచించారు. నంద్యాలలో గెలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారని ఆయన తెలిపారు. వైసీపీకి నంద్యాల ఫలితాలలో ఎదురైన అనుభవమే కాకినాడ కార్పొరేషన్ ఫలితాల్లో కూడా ఎదురవుతుందని ఆయన చెప్పారు.