మహిళా కానిస్టేబుల్ కు బలవంతంగా తాళి కట్టెశాడు

SMTV Desk 2019-08-30 12:44:31  

ఓ మహిళా కానిస్టేబుల్ కు వరుసకు బావ అయిన ఓ యువకుడు బలవంతంగా తాళి కట్టిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో ఓ మహిళా కానిస్టేబుల్ విధులను నిర్వహిస్తున్నారు. జగిత్యాలకు చెందిన చింతల కుమారస్వామి అనే యువకుడికి సదరు మహిళా కానిస్టేబుల్ వరుసకు మరదలు అవుతుంది. నిన్న విధుల్లో ఉన్న ఆమె వద్దకు చేరుకున్న కుమారస్వామి... ఆమెకు బలవంతంగా తాళి కట్టాడు. దీంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుపుతున్నామని ఈ సందర్భంగా ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు.