ఇకపై అన్నీ బ్యాంకులు ఒకే టైంకి!

SMTV Desk 2019-08-11 15:26:05  

ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఒకే పనివేళ్లలో పనిచేయనున్నాయి. ఈజ్ 2.0 ప్రోగ్రామ్‌లో (ఎన్‌హ్యాన్స్‌డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్) భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. బ్యాంకర్స్ ప్యానెల్‌ ఇప్పటికే మూడు టైమింగ్ స్లాట్స్‌ను ప్రతిపాదించింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనేది టైమింగ్ స్లాట్స్. వీటిల్లో బ్యాంకులన్నీ నచ్చిన ఒక టైమింగ్ స్లా్‌ట్‌ను ఎంచుకోవలసి ఉంది. బ్యాంకులకు మూడు టైమింగ్ స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంది. ఒక ప్రాంతంలో ఒక బ్యాంక్ ఒక టైమ్‌ను ప్రారంభమైతే, మరొక బ్యాంక్ వేరొక టైమ్‌‌కు తెరుస్తున్నారు. దీంతో ఖాతాదారులు గందరగోళానికి గురవుతున్నారు. అందువల్ల అన్ని బ్యాంకులకు ఒకే టైమ్‌ ఉండాలి భావిస్తున్నాం’ అని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సీఈవో వి.జి.కన్నన్ తెలిపారు. దాదాపుగా చాలా వాణిజ్య బ్యాంకులు 10:30 లేదా 11 గంటలకు ఓపెన్ అవుతున్నాయని పేర్కొన్నారు. బ్యాంకులు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీతో చర్చించి అభిప్రాయాలు తెలియజేయాలని కన్నన్ తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో ఆర్థిక మంత్రి శాఖ, పీఎస్‌బీ చీఫ్‌ల మధ్య జరిగిన మీటింగ్‌లో ఈ అంశం చర్చకు వచ్చింది. తర్వాత ఐబీఏకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య మరో సమావేశం జరిగింది. దీని తర్వాత ఐబీఏ చైర్మన్ సారథ్యంలో బ్యాంకింగ్ టైమింగ్స్‌పై ఒక సబ్ కమిటీ ఏర్పాటైంది.