తెలంగాణ ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్ అల్లం నారాయణ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ సోమవారం ముఖ్యమంత్రిని ప్రగతిభవన్లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్గా అల్లం నారాయణ పదవి కాలం జూన్ 30తో ముగిసింది. అయితే ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా అమలుపరుస్తున్న జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలపై ప్రెస్ అకాడమీ ప్రచురించిన పుస్తకాన్ని కేసీఆర్కు అల్లం నారాయణ అందజేశారు.