తొమ్మిది మంది భారత సిబ్బంది విడుదల చేసిన ఇరాన్

SMTV Desk 2019-07-26 15:31:39  

ఇరాన్ తాజాగా బ్రిటిష్ చమురు నౌకను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అందులో 18 భారతీయ సిబ్బంది ఉన్నారు. కాగా ఇరాన్‌ ఎమ్‌టీ రియా అనే నావను కూడా అదుపులోకి తీసుకుంది. ఇందులో మొత్తం 12 మంది భారత సిబ్బంది ఉన్నారు. అయితే వీరిలో తొమ్మిది మందిని ఇరాన్‌ దేశం విడుదల చేసినట్లు అధికారిక వర్గాల నుంచి సమాచారం. కాగా మరో ముగ్గురు ఇంకా వారి చెరలోనే ఉన్నారు. ఇటీవల అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఇరాన్‌ పలు నావలను నిబంధనల ఉల్లంఘనల పేరిట అదపులోకి తీసుకుంది. దీంతో అనేక మంది భారతీయులు వారి అదుపులోకి వెళ్లారు.అలాగే గ్రేస్‌1 నావలో ప్రయాణిస్తున్న 24 మంది భారత నావికులను జీబ్రాల్టర్‌ పోలీసు అథారిటీస్‌ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. లండన్‌లోని భారత రాయబారులు వారిని బుధవారం కలిశారని విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. వారిని విడుదల చేయించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.