ప్రొ కబడ్డీలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో యూ ముంబా జట్టుకు చుక్కెదురైంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 42-23 తేడాతో ముంబాను చిత్తు చేసింది. ఫేవరెట్గా బరిలోకి దిగిన ముంబా ఏ దశలోనూ జైపూర్కు పోటీ ఇవ్వలేక పోయింది. మరోవైపు ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జైపూర్ స్పష్టమైన ఆధిపత్యాన్ని చెలాయించింది. స్టార్ రైడర్ దీపక్ హుడా అసాధారణ ఆటతో చెలరేగి పోయాడు. దూకుడును ప్రదర్శిస్తూ ముంబాను హడలెత్తించాడు. హుడా ఏకంగా 11 పాయింట్లు సాధించి జైపూర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు దీపక్ నర్వాల్ (8), నితిన్ రావల్ (7) తమవంతు సహకారం అందించారు. ప్రథమార్ధం ముగిసే సమయానికి జైపూర్ 229 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో మరింత చెలరేగి పోయింది. ఎటాగింగ్ గేమ్తో ముంబాను చిత్తు చేసింది. మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ విజయం సాధించింది. సోమవారం జరిగిన పోరులో హర్యానా 3424 తేడాతో పుణేరి పల్టన్ను ఓడించింది. నవీన్ (14) అద్భుత ఆటతో హర్యానా విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ప్రత్యర్థి జట్టులో పవన్ (10) రాణించాడు.