జంక్ ఫుడ్ తింటే రూ.4.27 లక్షలు ఇస్తారంట!

SMTV Desk 2019-07-18 15:36:04  junk food eating in 30 days, feal

మీరు జంక్ ఫుడ్ ప్రియులా...అయితే మీకోసం ఒక బంపర్ ఆఫర్ వేచి చూస్తోంది. రోజూ చిప్స్, పాస్తా, బ్రెడ్ తింటే చాలు.. రూ.4.27 లక్షలు చెల్లిస్తారు. కానీ.. కొన్ని షరతులు వర్తిస్తాయి. వీటిని కేవలం ఒక రోజు తింటే సరిపోదు.. 30 రోజులు తినాలి. వేరే ఆహారం ముట్టకుండా వారు పెట్టే జంక్ ఫుడ్‌ను మూడు పూటలా తినాలి. యూకేకు చెందిన మల్టీ విటమిన్ కంపెనీ ‘ఫీల్’ ఈ సదావకాశాన్ని ఇస్తోంది. ఇందులో పాల్గొనేవారికి న్యూట్రిషనిస్టులు, వైద్యుల పర్యవేక్షణలో జంక్ ఫుడ్ మాత్రమే పెడతారు. వాటితోపాటు ఒక మల్టి విటమిన్ ట్యాబ్లెట్ కూడా ఇస్తారు. 30 రోజులపాటు ఈ ఆహారం తినేవారిలో పోషకాల స్థాయిలను తెలుసుకునేందుకే ఈ ప్రయోగం చేపడుతున్నారు. ‘ఫీల్’ ఉత్పత్తి చేసే ఆహారంలో 18 ముఖ్యమైన విటమిన్లు, పోషకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఆహారాన్ని తిన్నట్లయితే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయని చెప్పేందుకే ‘ఫీల్’ ఈ ప్రయోగం చేపట్టింది. ఇందులో పాల్గొనేవారికి తప్పకుండా 18 ఏళ్లు నిండాలి. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ప్రవేశంలేదు. 30 రోజుల్లోపు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారికి నగదు చెల్లించబోమని ‘ఫీల్’ యాజమాన్యం స్పష్టం చేసింది.