విశాఖపట్టణం, ఆగస్ట్ 30: విశాఖ ఏజెన్సీ అనగానే ప్రకృతి సిద్దమైన అందాలు, జాలువారే జలపాతాలు, ఎత్తైన పచ్చని కొండలు, కనిపిస్తాయి. నగరానికి మరో వైపు ఏవోబీను కేంద్రంగా ఏర్పాటు చేసుకొని సరిహద్దులో నల్లమందు పంట జోరుగా సాగుతుంది. నిషేధిత ఔషధాలను ఆంధ్రా, ఒడిశా సరిహద్దు రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా యువతకి అమ్మేస్తున్నారు. జిమాడుగుల మండలం మద్దెగురువులో 20 కిలోల నల్లమందు పట్టుబడటంతో ఎక్సైజ్ పోలీసులు ఆశ్చర్యపోయారు. దీని విలువ బహిరంగ మార్కెట్ లో లక్షల్లో ఉంటుందని తెలిపారు.