రాజస్థాన్, ఆగస్ట్ 30: రాజస్థాన్ లోని జోద్ పూర్ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ గర్భిణి పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చింది, సకాలంలో డెలివరి చేయాల్సిన వైద్యులు ఆపరేషన్ ధియేటర్ లో డెలివరి మహిళను ఆపి ఒకరిని ఒకరు దుర్భాషలాడుకున్నారు. ఈ ఆలస్యం కారణంగా లోకం చూడని పసికందు ప్రాణాలు కోల్పోయింది. దీంతో మహిళ పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటనపై బాధితురాలి బంధువులు వైద్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.