హైదరాబాద్, ఆగస్ట్ 29 : మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో విపక్షాలు చేపట్టిన మహాధర్నాలో మాజీ మంత్రి డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సభలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రజల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ చిచ్చుపెట్టి, సెంటిమెంట్ తో రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు మతిలేని చేష్టలు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు సాగు నీటి ప్రాజెక్టుపై ఎవరికీ నచ్చినట్టు వారు మాట్లాడి వివిధ ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహబూబ్ నగర్ నుండి నల్గొండకు నీళ్ళు ఇవ్వవద్దని ఎవరూ అనలేదని ఆమె స్పష్టం చేశారు.