హైదరాబాద్, ఆగస్టు 29 : అమలు కానీ హామీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని తెతెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేపీహెచ్బీ కాలనీలో ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కూలగొట్టిన తెదేపా జెండా దిమ్మె వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెరాసలోకి వెళ్లిన కూకట్ పల్లి శాసనసభ్యుడు మాదవరం కృష్ణారావుపై విమర్శలు వర్షం కురిపించారు. ఈ మేరకు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాల హైదరాబాద్ ను డల్లాస్ గా మారుస్తానన్న కేసీఆర్ హామీలు ఏమాయ్యాయని రేవంత్ ప్రశ్నించారు.