న్యూఢిల్లీ, ఆగస్టు, 29: సుప్రీంకోర్టు ఇచ్చిన కేసు తీర్పు పై ఇరవై ఏళ్ళు జైలు శిక్ష పడిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ను బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వెనకేసుకొస్తు, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే, కుట్రపూరితంగా ఇటువంటి ఆరోపణలను తెరపైకి తీసుకొచ్చారని వ్యాఖ్యానించినట్లు వార్తల్లో వచ్చిన విషయం తెలిసిందే. కాగా, మరోసారి ఇదే విషయంపై సాక్షి మహరాజ్ స్పందిస్తూ మీడియాతో మాట్లాడుతూ.. ఇంతకుముందు తాను చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా ప్రచురించిందన్నారు. గుర్మీత్ సింగ్ కు శిక్ష ఖరారు చేస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నట్లు, ఆయనకి మద్దతుగా ఎప్పుడు మాట్లాడలేదని ఆయన తెలిపారు. బాబా రామ్ పాల్, బాబా రామ్ రహీమ్, బాబా ఆశారామ్ వంటి వారు సన్యాసులు కాదని, ఇటువంటి వారిని అనుసరించే ముందు భక్తులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సాక్షి మహరాజ్ వెల్లడించారు.