ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బుధవారం ఓవల్ వేదికగా బంగ్లాదేశ్- న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ పై కివీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బంగ్లాను ఓడించి టోర్నీలో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది న్యూజిలాండ్. ఆఖరి వరకు ఇరు జట్లకు విజయం దోబూచులాడినా.. చివరికి కివీస్ 2 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. హెన్రీ (4/47) కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో 244 పరుగులకే పరిమితమైంది. షకిబ్ అల్ హసన్ (64) టాప్ స్కోరర్గా నిలిచాడు.అటు లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్.. రాస్ టేలర్ (82; 91 బంతుల్లో) సత్తా చాటడంతో 245 పరుగుల లక్ష్యాన్ని 47.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రాస్ టేలర్కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.