గురువారం పసిడి ధర క్షీణించింది. హైదరాబాద్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.33,540తగ్గింది. అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గుదలతో రూ.30,760కు క్షీణించింది. ఇదిలా ఉండగా వెండిలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పరిగెడుతూనే ఉంది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 0.09 శాతం పెరుగుదలతో 1,334.75 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్కు 0.08 శాతం పెరుగుదలతో 14.80 డాలర్లకు ఎగసింది.ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా రూ.32,560 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగా రూ.31,450 వద్ద కొనసాగుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.39,500 వద్ద స్థిరంగా ఉంది.