కేప్టౌన్: దక్షిణాఫ్రికాలో భారత్ కాన్సులేట్ జనరల్గా విధులు నిర్వహించి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్న డాక్టర్ కేజె శ్రీనివాస్కు టిఆర్ఎస్ ఎన్నారై శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. జొహన్నస్బర్గ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి టిఆర్ఎస్ ఎన్నారై టీం సభ్యులు, టిఏఎస్ఏ సభ్యులు, కాన్సులేట్ అధికారులు హాజరయ్యారు.