పెవిలియన్ కు చేరిన ఒపెనేర్లు!

SMTV Desk 2019-06-06 12:09:13  amla de kock

ప్రపంచకప్ టోర్నీలో భాగంగా నేడు ఇంగ్లాండ్ వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు సఫారీలు. ఇక మొదట ఇన్నింగ్స్ కు వచ్చిన దక్షిణాఫ్రికా ఒపెనేర్లు ఆమ్లా, డీకాక్ ఇద్దరూ బుమ్రా బౌలింగ్ లో పెవిలియన్ కు చేరుకున్నారు. నాల్గవ ఓవర్‌ను బుమ్రా గ్రాండ్‌గా స్టార్ట్ చేశాడు. 9 బంతుల్లో 6 పరుగులు చేసిన ఆమ్లాను బుమ్రా అద్భుతమైన స్వింగ్ బాల్‌తో పెవిలియన్ చేర్చాడు. బుమ్రా వేసిన బంతి ఆమ్లా బ్యాట్ అంచుకు తగులుతూ రోహిత్ శర్మ చేతుల్లోకి వెళ్లింది. 17 బంతుల్లో 10 పరుగులు చేసిన డి కాక్… విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది సఫారీ జట్టు. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్( కాప్టెన్), దుస్సేన్ లు ఉన్నారు.