ప్రపంచకప్ మెగా టోర్నీలో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమయిన టీమ్ఇండియాకు… జర్మనీ స్టార్ ఫుట్బాల్ థామస్ ముల్లర్ సపోర్ట్ గా నిలిచాడు. భారత జట్టు గెలవాలని కోరుకుంటున్నట్టు ముల్లర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. టీమ్ఇండియా జెర్సీని ధరించి కోహ్లి సేనకు బెస్ట్ విషెస్ తెలిపాడు. కోహ్లి అంటే తనకెంతో ఇష్టమన్న ముల్లర్… గతంలో జర్మనీ జట్టుకు కోహ్లి మద్దతు తెలిపిన సంగతిని గుర్తు చేశాడు. 2014 ఫుట్ బాల్ ప్రపంచకప్ సందర్భంగా కోహ్లి జర్మనీ జెర్సీని ధరించి మద్దతు తెలిపాడు.ప్రపంచకప్ చరిత్రలో భారత్పై సఫారీ జట్టుకు మెరుగైన రికార్డే ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు ఈ మెగా టోర్నీలో నాలుగు సార్లు తలపడగా మూడు సార్లు దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. భారత్ 2015 ప్రపంచకప్లో మాత్రమే ఒక్కసారి గెలిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఏడు వికెట్ల నష్టానికి 307పరుగులు చేసింది. అనంతరం సఫారీ జట్టును 177పరుగులకే కట్టడి చేసి 130పరుగుల తేడాతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.