ఏపీ టీడీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేశవ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
కాగా ఇప్పుడు ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్ గెలవడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పయ్యావుల రాజీనామాను ఆమోదించిన శాసన మండలి ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది.