ప్రముఖ స్మార్ట్ఫోన్స్ తయారీ కంపెనీ షావోమి తన Redmi K20 series స్మార్ట్ఫోన్స్ను ఇండియాలో జూలై నెలలో అందుబాటులోకి తీసుకురానున్నామని షావోమి ఇండియా ఎండీ మన కుమార్ జైన్ వెల్లడించారు. ఈ విషయాన్ని మను కుమార్ జైన్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇందులో 6 వారాల్లోగా ఈ ఫోన్లను భారత్లో లాంచ్ చేస్తామని తెలిపారు. అంటే జూలై నెలలో ఈ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. జూలై 15న మార్కెట్లోకి రావొచ్చనే అంచనాలున్నాయి. ఇకపోతే Redmi K20 Pro స్మార్ట్ఫోన్లో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, 48 ఎంపీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా, 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు మెమరీ, 20 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. Redmi K20 స్మార్ట్ఫోన్లో క్వాల్కామ్ 730 ప్రాసెసర్ ఉంటుంది. ఇక కంపెనీ రెండు ఫోన్లలోనూ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చింది.