ఏపీ అడ్వొకేట్ జనరల్ గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌

SMTV Desk 2019-06-05 14:47:27  ap advocate,

ఆంధ్రప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌ నియమితులయ్యారు. శ్రీరామ్‌ను ఏజీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా 2016 మే నుంచి ఏజీగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఈ మధ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌ను నియమిస్తూ సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు.