తిరుపతిలోని అనంత వీధిలో దారుణం చోటుచేసుకుంది. నడి రోడ్డుపై మామ కళ్ళలో కారం కొట్టింది ఓ కోడలు. కళ్ళలో కారం పడడంతో మంటతో బాధపడుతున్న తండ్రిపై కొడుకు కనికరం లేకుండా ఇనుప రాడ్తో దాడి చేసాడు. భార్యాభర్తల దాడిలో ఆ వృద్ధుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. భార్యాభర్తలిద్దరూ ఆస్తి కోసం వృద్ధుడిపై ఎప్పటి నుంచో వేధింపులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.
అయినా కూడా ఆ వృద్ధుడు ఈ వేధింపుల గురించి బయటికి తెలియనియ్యలేదు. ఇప్పుడు ఒక్కసారిగా వీధిలోనే అందరూ చూస్తుండగా మామపై కోడలు కారం చల్లడం.. తండ్రిపై కొడుకు దాడి చేయడం ఆ వీధిలోని వాళ్లను షాక్కు గురి చేసింది. ఆ వీధిలోని వాళ్లంతా ఆ దృశ్యాలను వాట్సాప్లో షేర్ చేయడంతో విషయం వెలుగు చూసింది. చుట్టుపక్కలవాళ్ళు బాధితుడిని రుయా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఇంతకు ముందే ఎన్నోసార్లు తిరుపతి వెస్ట్ జోన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తుంది.