ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. విశాఖ పర్యటనకు వెళ్లిన జగన్.. తిరిగి వెళ్తుండగా రోడ్డు పక్కన.. ‘బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి’ అంటూ కొందరు యువతీ యువకులు ఫ్లెక్సీలు పట్టుకున్నారు. అది గమనించిన జగన్.. వెంటనే కాన్వాయ్ ఆపించి వారి దగ్గరికెళ్లారు.
ఏం జరిగిందని ప్లెక్సీలు పట్టుకున్న వారిని ప్రశ్నించగా.. ‘మా స్నేహితుడు నీరజ్ కుమార్ రక్త కేన్సర్తో బాధ పడుతున్నాడు. ఆపరేషన్కు రూ.25 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. ఈ నెల 30వ తేదీలోగా అతడికి ఆపరేషన్ చేయాలంటున్నారు. లేకపోతే మా స్నేహితుడు మాకు దక్కడు’ అని సీఎం జగన్కు చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. వారి ఆవేదనకు చలించిపోయిన జగన్.. వెంటనే ఆపరేషన్కు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్కు ఆదేశాలిచ్చారు.
ముఖ్యమంత్రి జగన్ పెద్ద మనసుతో స్పందించి తమ స్నేహితుడికి సాయం చేస్తామని చెప్పడంతో నీరజ్ కుమార్ స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఇలాంటి సీఎంను చూడలేదని, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు