'భారత్' విషయంలో చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నా

SMTV Desk 2019-06-04 16:37:14  katrina kaif, bharat

సల్మాన్ ఖాన్... కత్రినా కైఫ్ జంటగా బాలీవుడ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా భారత్ . జూన్ 5వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ భారీగా ప్రచారం నిర్వహిస్తోంది. అయితే ఈ భారత్ సినిమాను ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడూ చూపించాలా అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు బార్బీగర్ల్‌ కత్రినా కైఫ్‌. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిశా పటానీ మరో హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే కొరియన్‌ సినిమా ఓడ్‌ టు మై ఫాదర్‌ కు హిందీ రీమేక్‌ గా ఇది తెరకెక్కింది. ఇందులో సల్మాన్‌ 18 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు పలు రకాల గెటప్‌లలో మెరవబోతున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కత్రినా కైఫ్ మాట్లాడుతూ... సల్మాన్ ఖాన్... తాను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని తెలిపారు. దీంతో సినిమాకు వచ్చే స్పందన ఎలా ఉంటుందోనని చాలా ఆతృతగా ఉందని కత్రినా వివరించారు.

అంతేకాకుండా అది ఎలాంటిది అంటే... నిజంగా నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. భారత్ విషయంలో చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నా. సినిమాను ప్రజలకు చాలా త్వరగా చూపించాలని ఉంది. వారి స్పందన తెలుసుకోవాలని ఉంది. సినిమాను తెరకెక్కించిన తీరు విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. సినిమా బాక్సాఫీసు వద్ద ఎంత వసూలు చేస్తుందో ముందే ఊహించడం కష్టమైన పని. ఎప్పటిలాగే ప్రేక్షకుల ప్రేమ.. ఆదరణ మాకు దక్కుతుందని ఆశిస్తున్నా అంటూ కత్రినా స్పష్టం చేశారు. అయితే ఈ సినిమా తర్వాత కత్రినా రోహిత్‌ శెట్టి చేస్తున్న సూర్యవంశీ లో నటిస్తున్నారు. ఇందులో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్నారు