ఇంటి వద్ద మూత్రం ఎందుకు పోశావునందుకు.. హత్య

SMTV Desk 2019-06-04 16:25:15  murder,

ఢిల్లీ: ఇంటి వద్ద మూత్రం ఎందుకు పోశావునందుకు ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన ఢిల్లీలోని గోవింద్ పూరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గత రాత్రి కరెంట్ పోవడంతో లిల్లూ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఇంటి బయట కూర్చున్నాడు. ఓ వృద్ధుడు (65) లిల్లూ ఇంటి గోడపై మూత్రం పోశాడు. దీంతో లిల్లూ తన ఇంటి గోడపై ఎందుకు మూత్రం విసర్జించావని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. వృద్ధుడు తనయులు అక్కడికి చేరుకొని లిల్లూపై ఇటుకలతో దాడి చేశారు. దాడిలో త్రీవంగా గాయపడిన లిల్లూ ఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. వృద్ధుడు కుమారుడు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లిల్లూపై పలు స్టేషన్లలో దొంగతనం కేసులున్నాయని పోలీసులు వివరించారు. హత్య చేసిన వృద్ధుడి కుమారులను పోలీసులు అరెస్టు చేశారు.