ఎపి ఎంసెట్‌-2019 ఫలితాలు విడుదల

SMTV Desk 2019-06-04 16:19:12  eamcet results

ఎపి ఎంసెట్‌-2019 ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. రాష్ట్ర ఉన్నతవిద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు తదితరులు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎపి ఎంసెట్‌కు తెలుగు రాష్ట్రాలకు చెందిన 2,82,901 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్‌కు 1,85,711 మంది, వ్యవసాయ, వైద్యవిభాగాలకు 81,916 మంది దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో ఏర్పడిన గందరగోళం కారణంగా ఎపి ఎంసెట్‌ ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరిగిందని అధికారులు తెలిపారు. తెలంగాణకు చెందిన 36,698 విద్యార్థులు ఎపి ఎంసెట్‌ పరీక్షకు హాజరయ్యారు.