నేను వాళ్లను మాత్రమే తిట్టాను

SMTV Desk 2019-06-04 16:17:38  Vihswaksen,

ఫలక్‌నుమా దాస్ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్న వారిపై సోషల్ మీడియా వేదికగా బూతుల దండకం అందుకున్న విశ్వక్ సేన్ వెనక్కి తగ్గాడు. కోపంలో బూతులు తిట్టేశా కాని నేను అన్నది ఆడియన్స్‌ని, రివ్యూ రైటర్స్‌ని కాదంటూ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. మా సినిమాకు సంబంధించి ప్రమోషన్లలో భాగంగా నా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో పెట్టాను. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి కొందరు కావాలని నా సినిమాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయినా వారి కామెంట్లు పట్టించుకోకుండా జనం సినిమా ఆదరిస్తున్నారని విశ్వక్ సేన్ తెలిపారు. ఇక బూతుల విషయం మీద స్పందిస్తూ బూతుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై స్పందిస్తూ ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలంటారు.. ఆ నేచర్ నాకు కాస్త తక్కువగా ఉంది. నేను ఏదో కోపంతో మాట్లాడిన దాన్ని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అది నా పర్సనల్ వీడియో. మీడియాను ఉద్దేశించి ఏమీ అనలేదనీ, రివ్యూలకు కొంతమంది తక్కువ రేటింగ్ ఇచ్చినా ఎందుకంటే ఎవరి టేస్ట్ వారిదని లైట్ తీసుకున్నట్లు తెలిపారు. సినిమా ఇప్పటికే 4 కోట్లు కలెక్షన్లు రాబట్టిందని, థియేటర్స్ అన్నీ హౌస్ ఫుల్‌ అవుతున్నాయని టిక్కెట్లు దొరకడం లేదనీ ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న సినిమాకి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. నేను వాళ్లను మాత్రమే తిట్టానని వాళ్లు ఎవరన్నది నాకు నిజంగా తెలియదని చెప్పుకొచ్చాడు.