బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లోకి ప్రవేశించి అంతర్జాతీయ స్టార్ గా దూసుకుపోతుంది హీరోయిన్ ప్రియాంక చోప్రా. అయితే తాజాగా ఆమె రాజకీయాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే అవి సరదాగా చేశారా లేకా సీరియస్ గా చేశారా అనేది పక్కనబెడితే ఆమె వ్యాఖ్యలు మాత్రం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదేమంటే... సహజంగా సమాజంలో మార్పు కోసం తన వంతు సాయం చేయడానికి ముందుంటారు ప్రియాంక. ఇదివరకెన్నడూ రాజకీయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ప్రియాంక. ఇప్పుడు తొలిసారిగా అవకాశముంటే తాను భారత ప్రధానిని అవుతానని.. ఓ అమెరికన్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక వెల్లడించి సనంచలనానికి దారి తీశారు.
అసలేమన్నారంటే... అవకాశం వస్తే నేను భారత ప్రధానిని అవుతా. నా భర్త నిక్ అమెరికా అధ్యక్షుడి పదవికి పోటీ చేస్తారు. నాకు రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశాలంటే నచ్చవు. కానీ దేశంలో మార్పు రావాలని నేను, నిక్ కోరుకుంటున్నాం అంటూ వివరించారు. కాగా ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతుంది. అయితే ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ ప్రాజెక్ట్లతో చాలా బిజీగా గడుపుతున్నారు. బాలీవుడ్లో ది స్కై ఈజ్ పింక్ అనే సినిమాలో నటించిన ఆమె త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.