న్యూఢిల్లీ, ఆగస్టు 29 : భారత దేశంలో పూర్తి స్థాయి భద్రతతో, బుల్లెట్ ప్రూఫ్ కారు, సెక్యూరిటీతో సుప్రీంకోర్టుకు వచ్చే న్యాయమూర్తి దీపక్ మిశ్రా. ఈ స్థాయిలో సెక్యూరిటీ ఉన్న తొలి చీఫ్ జస్టిస్ గానూ నిలిచారు. సోమవారం రోజున భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ముంబై బాంబు పేలుళ్ల కేసు వంటి అత్యంత సమస్యాత్మక కేసులో దోషి యాకబ్ మెమన్ కు ఉరిశిక్షను ఖరారు అయిన తరువాత, జూలై 30, 2015న అతని చివరి క్షమాభిక్షను తిరస్కరించిన సుప్రీంకోర్టు బెంచ్ లో దీపక్ మిశ్రానే ప్రధాన న్యాయమూర్తి. ఆపై మిశ్రాకు హత్య చేస్తామని బెదిరింపులు రావడంతో వెంటనే ఆయనకు పూర్తి భద్రతను కల్పించారు. అప్పటి నుంచి సెక్యూరిటీతో కోర్టుకు వస్తున్న న్యాయమూర్తిగా ఆయన నిలిచారు.