లండన్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జట్టులో ఉన్నప్పుడు అందరితో సరదాగా, అందరిని ఆటపట్టిస్తూ ఉండేవాడు. అయితే సచిన్ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను సచిన్ ఏడిపించి ఘటన షేర్ చేసుకున్నాడు. 2003 వరల్డ్ కప్లో తొలుత పాక్ బ్యాటింగ్ చేసి 274 పరుగులు లక్ష్యాన్ని భారత జట్టు ముందు ఉంచింది. తాను ఎప్పుడూ ఓపెనర్గా స్ట్రైక్ తీసుకోలేదని. సెహ్వాగ్ వచ్చి తనని మొదటి బంతి ఆడమని కోరాడు. అప్పటికే సెహ్వాగ్ ఏడిపించాలని సచిన్ నిర్ణయానికి వచ్చాడు. సెహ్వాగ్ చూస్తూ…. నీ గ్యాస్తో టీమ్ని ఇబ్బంది పెడుతున్నావని సచిన్ స్మైల్ ఇస్తూ చెప్పాడు. ఈ జ్ఞాపకాలను సచిన్ ఈ రోజు గుర్తు చేసుకున్నాడు.