ఉద్రిక్తంగా మారిన సుడాన్‌ నిరసనలు

SMTV Desk 2019-06-03 15:56:38  sudan

ఖార్తోమ్‌: సుడాన్‌ రాజధాని ఖార్‌తౌమ్‌లో జవాన్ల పాలనను వ్యతిరేఖిస్తూ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. శాంతియుతంగా ర్యాలీ తీసిన నిరసనకారులపై సుడాన్‌ సైనికులు విరుచుకుపడి వారిపై లాఠీలు ఝళిపించారు. బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. అంతటితో ఆగకుండా నిరసనకారులపై సుడాన్‌ సైన్యం కాల్పులకు తెగబడిటనట్టు ప్రత్యక్ష సాక్ష్యులు ఆరోపిస్తున్నారు. సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు నిరసనకారులు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. అనంతరం నిరసనకారులు ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో, ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ను పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ చుట్టుముట్టింది.