లిబియాలో పడవ ప్రమాదం...ఏడుగురు గల్లంతు

SMTV Desk 2019-06-03 15:45:39  libya boat accident

లిబియా: లిబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద వశాత్తు పడవ మునిగి ఏడుగురు గల్లంతయ్యారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం ఇద్దరి మృతదేహాల్ని వెలికితీశారు. గర్రాబుల్లీ పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో 80 మంది వలసదారులు పడవలో వెళుతుండగా ప్రమాదవశాత్తూ నీటిలో మునిగింది. ఈ ఘటనలో లిబియన్ కోస్ట్ గార్డ్స్ 73 మందిని రక్షించారు. వేలాదిమంది వలసదారులు రబ్బరు బోట్లలో సముద్రంలో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.