చెన్నై, ఆగస్టు 29 : అన్నాడీఎంకే తిరుగుబాటు నేత దినకరన్ ను ఇప్పటికే పార్టీ పదవి నుంచి తొలగించినట్లు పళనిస్వామి-పన్నీర్ సెల్వం పార్టీ స్పష్టం చేసింది. పార్టీ పదవులకు సంబంధించి ఆయన చేసిన మార్పులేవీ చెల్లవని తేల్చి చెప్పింది. శశికళను సైతం సాగనంపి అన్నాడీఎంకే పై పూర్తి పట్టు సాధించేలా పనిచేయనున్నట్లు సంకేతాలు ఇస్తూ చెన్నైలో జరిగిన సమావేశంలో పన్నీర్ సెల్వం వర్గం ఈ మేరకు 4 తీర్మానాలు చేసింది. అయిన ఏ మాత్రం వెనుక తగ్గని దినకరన్ ఎంతోమంది మాజీ నేతలను పార్టీ నుంచి బహిష్కరించారు.