విశాఖపట్నం: చింతపల్లి మండలం బలపం చెరువూరు సమీపంలో విషాదం చోటు చేసుకుంది. ఆటో ఆదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు.ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పతికి తరలించారు. వారపు సంతకు వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, విద్యుత్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.