ఫస్ట్ మ్యాచ్‌తోనే రికార్డు బద్దలు

SMTV Desk 2019-06-03 15:03:25  bangladesh

ప్రపంచకప్ మెగా టోర్నీ 2019 లో ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్ జట్టు రికార్డ్‌ని సృష్టించింది. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా నేడు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో తోలుత ఇన్నింగ్స్ పూర్తి చేసిన బంగ్లాదేశ్ 330 పరుగులు చేసి విండీస్ కు 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. ఆరంభంలోనే 75/2తో నిలిచిన బంగ్లాదేశ్‌ జట్టుని మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌లు ముష్ఫికర్ రహీమ్ (78: 80 బంతుల్లో 8x4), షకీబ్ అల్ హసన్ (75: 84 బంతుల్లో 8x4, 1x6) శతక భాగస్వామ్యంతో మెరుగైన స్థితిలో నిలిపారు. సఫారీ బౌలర్లని సహనంతో ఎదుర్కొన్న ఈ జోడీ.. మూడో వికెట్‌కి 142 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కి ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. అంతేకాకుండా.. మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ వన్డే చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ప్రపంచకప్‌ 2015లో భాగంగా అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్ జోడీ.. 141 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కి ఇప్పటి వరకూ ఇదే అత్యుత్తమ భాగస్వామ్యంకాగా.. తాజాగా ఆ రికార్డ్‌ని రహీమ్-హసన్ జోడీ 142 పరుగులతో బద్ధలుకొట్టింది. ఈరోజు తొలుత వికెట్ల పతనానికి అడ్డుకట్టవేసిన ఈ జోడీ.. ఆ తర్వాత వరుస బౌండరీలతో ఎదురుదాడి చేసింది. అయితే.. అర్ధశతకాలు పూర్తి చేసుకున్న తర్వాత స్కోరు వేగం పెంచే ప్రయత్నంలో వికెట్లు చేజార్చుకుంది. రెండు రికార్డుల్లోనూ రహీమ్ ఉండటం కొసమెరుపు.